ఇంట గెలిచి రచ్చ గెలవమని పెద్దలు చెప్పారు. మంత్రి రోజాకు ఇప్పుడు ఇదే వర్తిస్తుంది. వచ్చే ఎన్నికలలో తన గెలుపు సంగతి అటుంచితే..నగరిలో సొంతపార్టీ నేతల పోరు రోజురోజుకు ఎక్కువ అవుతుంది. దీంతో గెలవడం మాట పక్కన పెడితే..అసలు ఈ ఎన్నికలలో సీటు దక్కుతుందో లేదోనన్న అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి.
తిరుపతి జిల్లా నగరిలో ర తాజాగా వైసీపీ వర్గ పోరు భగ్గుమంది. మంత్రి రోజాకు ఈ ఎన్నికల్లో టికెట్ ఇస్తే మాత్రం తాము కచ్చితంగా ఓడిస్తామని సొంత పార్టీలోని వ్యతిరేక వర్గం హెచ్చరిస్తోంది. రోజా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. అయితే నగరి నియోజకవర్గంలో ఆమె చేసిన అభివృద్ధి శూన్యం అనే టాక్ బీభత్సంగా ఉంది.
READ MORE : Click Here