ఈ సర్వేను ప్రజలు నమ్మరన్న అమర్‌నాథ్

 ఏపీలో వైసీపీ గవర్నమెంట్ ఓడిపోతుందంటూ చెబుతోన్న ప్రశాంత్ కిషోర్ సర్వే నిజం కాదని చెప్పారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ . ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం రాత్రి విశాఖలో మాట్లాడిన ఆయన..ప్రముఖ స్ట్రాటజిస్ట్ పీకేకు  కౌంటర్ ఇచ్చారు.టీడీపీ అధినేత చంద్రబాబు.. ఒక పీకే సరిపోడని, రెండో పీకేని తెచ్చుకున్నారని అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు.




ప్రశాంత్ కిషోర్‌తో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు 2,3 గంటలు భేటీ అయ్యారన్న అమర్ నాథ్.. చంద్రబాబు, ప్రశాంత కిషోర్ చెల్లని రూపాయలంటూ ఘాటుగా విమర్శించారు. బిహార్‌లో చెల్లని రూపాయి ఏపీలో చెల్లుతుందా అంటూ పీకేపై సెటైర్లు వేశారు.   పీకే సర్వేలు ప్రజలు నమ్మే రోజులు పోయాయని  మంత్రి చెప్పుకొచ్చారు.

READ MORE : Click Here

Post a Comment

Previous Post Next Post