ఏపీలో.. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వంగవీటి రాధాకృష్ణ వ్యవహారం కాక రేపుతోంది. గత ఎన్నికల ముందు రాధాకృష్ణ టీడీపీలో చేరారు. అప్పుడే టికెట్ ఆశించినప్పటికీ హైకమాండ్ ఆయన్ను పక్కకు పెట్టేసింది. పార్టీ గెలుపొందాక తగిన నామినేటెడ్ పదవి కట్టబెడుతామని హామీ ఇచ్చింది.
కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో.. ఏ పదవీ దక్కలేదు. ఇక త్వరలో జరగబోయే ఎన్నికల్లోనైనా టికెట్ దక్కుతుందని రాధా ఆశించారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ వెళ్లకుండా.. ఇక్కడే ఉండిపోయారు.
READ MORE : Click Here